నేడు యాదాద్రి క్షేత్రానికి కేసీఆర్
ABN , First Publish Date - 2022-02-07T07:13:26+05:30 IST
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని సీఎం కేసీఆర్ సోమవారం సందర్శించనున్నారు.
ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించనున్న సీఎం
యాదాద్రి టౌన్, ఫిబ్రవరి 6: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని సీఎం కేసీఆర్ సోమవారం సందర్శించనున్నారు. హైదరాబాద్లో సోమవారం ఉదయం 11 గంటలకు బయలుదేరనున్న సీఎం కేసీఆర్ యాదాద్రి కొండపైకి చేరుకుని ఆలయ ఉద్ఘాటనకు సంబంధించిన పనులను పరిశీలించనున్నట్లు ఈవో గీతారెడ్డి తెలిపారు. మహాకుంభ సంప్రోక్షణ, మహా సుదర్శన యాగం నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. కాగా, 2014లో సీఎం హోదాలో తొలిసారి యాదాద్రిని సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు 15సార్లు సందర్శించారు.