పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి

ABN , First Publish Date - 2020-04-10T11:51:34+05:30 IST

ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని గజపతి నగరం ఎమ్మెల్యే

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి

ఎమ్మెల్యే అప్పలనర్సయ్య 


బుడతనాపల్లి (గంట్యాడ), ఏప్రిల్‌ 9: ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య అన్నారు. బుడతనాపల్లి గ్రా మంలో చేపట్టిన సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారీ కార్య క్రమాన్ని ఆయన గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈసం దర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పా టించాలని కోరారు.


లాక్‌డౌన్‌ పాటించాలని పిలుపునిచ్చారు. అనం తరం గ్రామంలోని స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన నిత్యా వసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గ్రామా నికి చెందిన 600 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నిర్మలాదేవి, వైసీపీ నాయ కులు వర్రి నర్సింహమూర్తి, నారాయణమూర్తి రాజు, కొండపల్లి కొండలరావు, జైహింద్‌ కుమార్‌, సుంకరి శ్రీను, లచ్చిరెడ్డి కృష్ణ, కృష్ణంజరాజు, పతివాడ భాస్కర్‌రావు, రంధి రామునాయుడు, మల్లునాయుడు, ప్రసాద్‌రాజు తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-04-10T11:51:34+05:30 IST