నాంగల్ అత్యాచార బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా: కేజ్రీవాల్

ABN , First Publish Date - 2021-08-04T21:41:02+05:30 IST

అత్యాచారం, హత్యకు గురైన మైనర్ బాలిక కుటుంబ సభ్యులను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్..

నాంగల్ అత్యాచార బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: అత్యాచారం, హత్యకు గురైన మైనర్ బాలిక కుటుంబ సభ్యులను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారంనాడు పరామర్శించారు. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అనంతరం మీడియాతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించానని, వారికి ఏర్పడిన లోటును తాము భర్తీ చేయలేనప్పటికీ ఆర్థిక సాయంగా ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తుందని తెలిపారు. ఘటనపై మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశించడంతో పాటు గట్టి లాయర్లను ఏర్పాటు చేస్తామని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని అన్నారు.


కాగా, దీనికి ముందు బాధితురాలి కుటుంబాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనను సుమోటాగా ఎన్‌సీపీసీఆర్ బుధవారంనాడు తీసుకుది. బాధితురాలి తల్లి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా నలుగురు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-08-04T21:41:02+05:30 IST