పంజాబ్ ఎమ్మెల్యేలతో ఢిల్లీ సీఎం భేటీ... అసెంబ్లీ ఎన్నికలపై చర్చ!
ABN , First Publish Date - 2021-08-02T17:56:31+05:30 IST
పంజాబ్ ప్రజలకు 300 యూనిట్ల విద్యుత్...
అమృత్సర్: పంజాబ్ ప్రజలకు 300 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందిస్తామనే హామీ ఇచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇప్పుడు పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. మరోవైపు రైతుల సమస్యలపై తన గళం వినిపిస్తున్నారు. రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆఫ్ అధినేత కేజ్రీవాల్ ఉవ్విళ్లూరుతున్నారు. దీనిలో భాగంగా పంజాబ్ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజాగా సీఎం కేజ్రీవాల్ పంజాబ్లోని ఆప్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చించారు. పంజాబ్లోని ప్రజల మనసులను గెలుచుకోవాలంటే ఎటువంటి వ్యూహాలు అనుసరించాలనే దానిపై ఎమ్మెల్యేలతో చర్చించారు. ఈ సమావేశం అనంతరం ఆప్ ఎంపీ భగవంత్ మాన్ మీడియాతో మాట్లాడుతూ 2017లో పార్టీ ఇక్కడి ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చిందని, వాటిని నెరవేరుస్తుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో సత్తా చాటేందుకు పార్టీ నేతలంతా ఐక్యంగా కృషి చేస్తున్నారని తెలిపారు.