ప్రతి మహిళకు నెలకు రూ.1000: పంజాబీలకు కేజ్రీవాల్ హామీ

ABN , First Publish Date - 2021-11-22T22:33:32+05:30 IST

2022లో పంజాబ్‌లో మేం అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ఉన్న ప్రతి మహిళకు 1,000 రూపాయలు నెల నెలా ఇస్తాం. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఇందుకు అర్హులే. ఒక కుటుంబంలో ముగ్గురు మహిళలు ఉంటే ముగ్గురికి ఒక్కొక్కరికీ..

ప్రతి మహిళకు నెలకు రూ.1000: పంజాబీలకు కేజ్రీవాల్ హామీ

చండీగఢ్: తొందర్లో జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి ఖాతాలో నెలకు 1,000 రూపాయలు వేస్తామని పంజాబీ మహిళలకు ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళలు ఇందుకు అర్హులేనని కేజ్రీవాల్ అన్నారు. సోమవారం పంజాబ్‌లోని మోగాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ పాల్గొని ప్రసంగించారు.


‘‘2022లో పంజాబ్‌లో మేం అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ఉన్న ప్రతి మహిళకు 1,000 రూపాయలు నెల నెలా ఇస్తాం. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఇందుకు అర్హులే. ఒక కుటుంబంలో ముగ్గురు మహిళలు ఉంటే ముగ్గురికి ఒక్కొక్కరికీ 1,000 రూపాయలు ఇస్తాం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా సాధికారత కార్యక్రమం’’ అని కేజ్రీవాల్ అన్నారు.

Updated Date - 2021-11-22T22:33:32+05:30 IST