దేశంలో తొలి ప్లాస్మా బ్యాంక్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2020-07-02T19:50:25+05:30 IST

దేశంలో తొలి ప్లాస్మా బ్యాంక్ ఢిల్లీలో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ ప్లాస్మా బ్యాంకును వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా..

దేశంలో తొలి ప్లాస్మా బ్యాంక్‌ ప్రారంభం

న్యూఢిల్లీ: దేశంలో తొలి ప్లాస్మా బ్యాంక్ ఢిల్లీలో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ ప్లాస్మా బ్యాంకును వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గురువారం ప్రారంభించారు. ప్లాస్మా డొనేట్ చేసేందుకు ముందుకు రావాలని ప్రజలను కోరారు.


'కోవిడ్-19 నుంచి కోలుకుని, 18 నుంచి 60 ఏళ్ల లోపు వయస్సు, 50 కిలోలకు పైగా బరువు ఉన్న వ్యక్తులు కోవిడ్ పేషెంట్ల కోసం ప్లాస్మా డొనేట్ చేయవచ్చు. పిల్లలను కన్న తల్లులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు ప్లాస్మా ఇవ్వడానికి అనర్హులు' అని ముఖ్యమంత్రి తెలిపారు. మధుమేహం, రక్తపోటు, కేన్సర్స్‌తో బయటపడిన వారు, లివర్, కిడ్నీ, హృద్రోగ సమస్యలు ఉన్న వారు ప్లాస్మా డొనేట్ చేయరాదని చెప్పారు. ప్లాస్మా డొనేట్ చేయడానికి ప్రజలు ముందుకు వచ్చినప్పుడే ప్లాస్మా బ్యాంక్ ఏర్పాటు ఆశయం నెరవేరి విజయవంతమవుతుందని చెప్పారు. అర్హత కలిగి, ప్లాస్మా డొనేట్ చేసేందుకు ముందుకు వచ్చే వారు 1031కు కానీ వాట్సాప్ నెంబర్ 8800007722ను కానీ కాంటాక్ట్ చేయాలని కోరారు. డాక్టర్లు అందుబాటులోకి వచ్చి వివరాలు తీసుకుంటారని చెప్పారు.


'ఐఎల్‌బీఎస్ ఆసుపత్రిలో ప్లాస్మా బ్యాంక్ ఏర్పాటు చేశాం. ప్లాస్మా ఇవ్వదలచిన వారు నేరుగా వచ్చినట్లయితే ప్రాథమిక పరీక్షలు పూర్తి చేసి ప్లాస్మా తీసుకుంటారు. కోవిడ్‌కు వాక్సిన్ వచ్చేంతవరకూ ప్లాస్మా థెరపీ ఉపయుక్తమవుతుంది. మరణాల సంఖ్య కూడా తగ్గుతుంది' అని కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో ఇంతవరకూ 89,802 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.

Updated Date - 2020-07-02T19:50:25+05:30 IST