కేరళ అసెంబ్లీ స్పీకర్‌కు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2021-04-11T00:24:09+05:30 IST

కేరళ అసెంబ్లీ స్పీకర్ శ్రీరామకృష్ణన్ కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో తనకు కొవిడ్-19 పాజిటివ్ అని ....

కేరళ అసెంబ్లీ స్పీకర్‌కు కరోనా పాజిటివ్

తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ స్పీకర్ శ్రీరామకృష్ణన్ కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో తనకు కొవిడ్-19 పాజిటివ్ అని గుర్తించినట్టు ఆయన ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తన అధికారిక నివాసంలోనే వైద్య పర్యవేక్షణలో ఉన్నట్టు  స్పీకర్ తెలిపారు. ఇటీవల కాలంలో తనకు సమీపంగా మెలిగిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కూడా ఆయన కోరారు. కాగా డాలర్ స్మగ్లింగ్ కేసులో కస్టమ్స్ అధికారులు నిన్న శ్రీరామకృష్ణన్ వాంగ్మూలం రికార్డు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల సీఎం పినరయి విజయన్, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ కూడా కరోనా ఇన్ఫెక్షన్‌కి గురై ఆస్పత్రిలో చేరారు. 

Updated Date - 2021-04-11T00:24:09+05:30 IST