‘పినరయి విజయన్... కేరళ భగవాన్’... వివాదాస్పద హోర్డింగ్!
ABN , First Publish Date - 2021-07-25T16:40:45+05:30 IST
కేరళలోని వలన్చెరిలో ఏర్పాటు చేసిన...
తిరువనంతపురం: కేరళలోని వలన్చెరిలో ఏర్పాటు చేసిన ఒక హోర్డింగ్ వివాదాస్పదంగా మారింది. విష్ణు ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన ఈ హోర్డింగ్పై ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేరళ భగవంతుడని రాసివుంది. ఈ హోర్డింగ్ గురించి సీపీఎం నేతలు మాట్లాడుతూ దీనిలో తమ హస్తం లేదని స్పష్టం చేశారు.
ఈ హోర్డింగ్పై విజయన్ భారీ ఫొటోతో పాటు... ‘భగవంతుడెవరని మీరు ప్రశ్నిస్తే... ఆహారం అందించేవాడేనని జనం చెబుతారు’ అని రాసివుంది. ఈ హోర్డింగ్ గురించి విష్ణు ఆలయ అధికారులు మాట్లాడుతూ దీనిని గత మే మాసంలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఏర్పాటు చేశారని తెలిపారు. దీనిని సీపీఎం కార్యకర్తలే ఏర్పాటు చేశారన్నారు. కాగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో కూడా ఇటువంటి పలు బోర్డులు ఏర్పాటు చేశారు. వాటిపై క్యాబినెట్ మంత్రుల ఫొటోలు కూడా ఉన్నాయి. ఈ తరహా ఫొటోలపై విష్ణు ఆలయ సమితి అధ్యక్షులు రవీంద్రన్ మాట్లాడుతూ వీటిని కొందరు వ్యతిరేకిస్తున్నారని, ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ హోర్డింగ్ను ఇక్కడి నుంచి దూరంగా తరలించాలని కోరారు.