కేరళ సీఎంకి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2021-04-09T00:28:33+05:30 IST

కేరళ సీఎం పినరయి విజయన్‌ కొవిడ్-19 ఇన్ఫెక్షన్‌కి గురయ్యారు. ఆయనకు కరోనా పాజిటివ్‌ ఉన్నట్టు నిర్ధారణ...

కేరళ సీఎంకి కరోనా పాజిటివ్

తిరువనంతపురం: కేరళ సీఎం పినరయి విజయన్‌ కొవిడ్-19 ఇన్ఫెక్షన్‌కి గురయ్యారు. ఆయనకు కరోనా పాజిటివ్‌ ఉన్నట్టు నిర్ధారణ అయ్యిందనీ... అయితే కరోనా లక్షణాలేవీ ఆయనలో కనిపించడం లేదని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన కాన్నూర్‌లోని తన నివాసంలోనే ఉన్నారని తెలిపాయి. ‘‘ప్రస్తుతం ఆయనకు కరోనా లక్షణాలు లేవు. అయితే త్వరలోనే ఆయనను కోజికోడ్ మెడికల్ కాలేజీకి తరలించే అవకాశం ఉంది...’’ అని సీఎంవో వర్గాలు పేర్కొన్నాయి. విజయన్ కుమార్తె వీణా విజయన్, అల్లుడు పీఏ మహ్మద్ రియాస్ కూడా ఇంతకు ముందు కరోనా బారిన పడ్డారు. ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం విజయన్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. 

Updated Date - 2021-04-09T00:28:33+05:30 IST