ఉజ్జయిని మహాకాళేశ్వరునికి గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పూజలు

ABN , First Publish Date - 2022-01-08T23:30:56+05:30 IST

కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ శనివారం మధ్య ప్రదేశ్‌లోని

ఉజ్జయిని మహాకాళేశ్వరునికి గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పూజలు

ఉజ్జయిని : కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ శనివారం మధ్య ప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహా కాళేశ్వరునికి హారతి సేవ సమయంలో ఆయన పూజలు చేసినట్లు దేవాలయం యంత్రాంగం ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలోని 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఉజ్జయిని ఒకటి. 


ఉజ్జయిని మహాకాళేశ్వర దేవాలయం ప్రతినిధి గణేశ్ ధాకడ్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ శనివారం మహాకాళేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఆయన కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పూజలు చేసినట్లు తెలిపారు. అర్చకులు సంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఆయనకు దేవాలయం అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికినట్లు చెప్పారు. ఆయన 40 నిమిషాలపాటు ఈ దేవాలయంలో గడిపారని పేర్కొన్నారు. 


మహాకాళేశ్వరుని దర్శనం చేసుకోవడం వల్ల ఎటువంటి అనుభూతి కలిగిందని పూజల అనంతరం విలేకర్లు అడిగిన ప్రశ్నకు గవర్నర్ ఆరిఫ్ సమాధానమిస్తూ, మూగవానికి మిఠాయి తినిపించి, దాని రుచి చెప్పమన్నట్లుగా ఈ ప్రశ్న ఉందని అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మహాకాళేశ్వరుని దర్శనం చేసుకోవడం తప్పనిసరి అన్నారు. ప్రస్తుతం మానవాళి చాలా ఇబ్బందుల్లో ఉందని, మానవాళికి మంచి జరగాలని, దేశం సుభిక్షంగా ఉండాలని మహాకాళేశ్వరుని కోరుకున్నానని, ఆశీర్వాదాలు పొందానని తెలిపారు. 


Updated Date - 2022-01-08T23:30:56+05:30 IST