రిటైర్మెంట్ రోజు ఆఫీస్లో నేలపై నిద్రించిన ఐపీఎస్ అధికారి
ABN , First Publish Date - 2020-06-01T22:33:56+05:30 IST
కేరళ సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారి జాకబ్ థామ్సన్ తన సర్వీసులో చివరి రోజు..
తిరువనంతపురం: కేరళ సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారి జాకబ్ థామ్సన్ తన సర్వీసులో చివరి రోజు ఆఫీస్లోనే నేలపై నిద్రించి ప్రత్యేకత చాటుకున్నారు. ఆదివారం ఉదయం నిద్ర లేచిన తర్వాత తన ఆఫీస్లో నేలపై వేసిన బెడ్షీట్ను ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ‘‘సివిల్ సర్వీస్- చివరి రోజు ప్రారంభం, నిద్ర కార్యాలయంలోనే..’’ అని థామస్ తన ఫేస్బుక్లో పేర్కొన్నారు. 1985 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన థామస్ తన కెరీర్లో అనేక సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. ఫలితంగా తన సర్వీసులో దాదాపు 35 ఏళ్ల పాటు యూనిఫామ్ విధులకు దూరం కావాల్సి వచ్చింది. ఆయన సర్వీసులో అధిక భాగం వివిధ ప్రభుత్వ శాఖల్లోకి డిప్యూటేషన్ కింద పంపించారు. చివరికి లోహ పరిశ్రమల మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఆయన రిటైరయ్యారు.