రాత్రికి రాత్రి కోటీశ్వరుడైన కేరళ కూలీ

ABN , First Publish Date - 2020-02-12T17:39:25+05:30 IST

ఓ రోజువారీ కూలీ రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ఘటన కేరళ రాష్ట్రం మలూర్‌లోని తోలంబ్రా ప్రాంతం పురాలీమాల కైతాంచల్ కురీచయ కాలనీలో వెలుగుచూసింది.....

రాత్రికి రాత్రి కోటీశ్వరుడైన కేరళ కూలీ

కన్నూర్ (కేరళ): ఓ రోజువారీ కూలీ రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ఘటన కేరళ రాష్ట్రం మలూర్‌లోని తోలంబ్రా ప్రాంతం పురాలీమాల కైతాంచల్ కురీచయ కాలనీలో వెలుగుచూసింది. పేరూనన్ రాజన్ (58) అనే వ్యక్తి దినసరి కూలీగా పనిచేస్తూ పలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు. తాను పడుతున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ఏ రోజు అయినా అదృష్టం తలుపు తట్టిందనే ఆశతో ప్రతినిత్యం లాటరీ టికెట్లు కొనేవాడు. రాజన్ కొన్న లాటరీ టికెట్టుకు కేరళ క్రిస్టమస్ బంపర్ లాటరీ రూ.12కోట్లు దక్కాయి. తనకే బంపర్ లాటరీ లభించిందని తెలుసుకున్న రాజన్ షాక్ కు గురయ్యారు. తనకే ఇంత పెద్ద లాటరీ వస్తుందని ఊహించలేదని రాజన్ ఉద్వేగంగా చెప్పారు. లాటరీ వచ్చాక రాజన్ తన భార్య రజనీ, కుమారుడు రిజిల్, కుమార్తె అక్షరలతో కలిసి కన్నూర్ జిల్లా సహకార బ్యాంకుకు వచ్చి అక్కడి అధికారులకు టికెట్ అప్పగించారు.

కూతుపరంబ పట్టణంలో తాను లాటరీ టికెట్టు కొన్నానని, ముందుగా ఈ లాటరీ డబ్బులతో తనకున్న అప్పులు తీరుస్తానని రాజన్ చెప్పారు. రూ.12 కోట్ల లాటరీకి గాను పన్నులు పోను తనకు రూ.7.2 కోట్లు వస్తాయని, ఆ డబ్బుతో తనకు గతం సహాయపడిన వారికి తాను సాయం చేస్తానని రాజన్ చెప్పారు. చెమట చిందించి సంపాదించే తనకు డబ్బు విలువ తెలుసునని, అందుకే ఈ లాటరీ డబ్బును వృథా చేయనని రాజన్ వివరించారు. 

Updated Date - 2020-02-12T17:39:25+05:30 IST