కేరళలో రికార్డు స్థాయిలో నమోదైన కేసులు

ABN , First Publish Date - 2020-08-15T03:28:50+05:30 IST

కేరళలో నేడు రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 1,569 కొత్త కేసులు వెలుగు

కేరళలో రికార్డు స్థాయిలో నమోదైన కేసులు

తిరువనంతపురం: కేరళలో నేడు రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 1,569 కొత్త కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలో ఒక రోజులో ఇన్ని కేసులు వెలుగు చూడడం ఇదే తొలిసారి. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 41,277కు పెరిగింది. కరోనా సోకిన వారిలో 27 మంది ఆరోగ్య కార్యకర్తలు కూడా ఉన్నట్టు ఆరోగ్య మంత్రి కేకే శైలజ తెలిపారు. నేడు కొత్తగా 1304 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 26,996కు పెరిగినట్టు మంత్రి పేర్కొన్నారు. తాజా కేసుల్లో 1354 స్థానికంగా సంక్రమించినవి కాగా, 86 కేసుల మూలాలను గుర్తించాల్సి ఉందన్నారు. 


రాష్ట్రవ్యాప్తంగా 1.55 లక్షల మంది ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండగా, వీరిలో 12,734 మంది వివిధ ఆసుపత్రులలోని ఐసోలేషన్ వార్డుల్లో ఉన్నారు. ఇక, గత 24 గంటల్లో 31,738 శాంపిళ్లు పరీక్షించినట్టు ప్రభుత్వం తెలిపింది. 

Updated Date - 2020-08-15T03:28:50+05:30 IST