కేసీఆర్‌ కంటే నిజమైన హిందువు ఎవరూ లేరు

ABN , First Publish Date - 2020-11-22T09:39:44+05:30 IST

హిందుత్వకు బీజేపీ వక్రభాష్యం చెబుతోందని, అన్ని వర్గాలనూ ఆదరించేదే హిందూ మతమని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు అన్నారు.

కేసీఆర్‌ కంటే నిజమైన హిందువు ఎవరూ లేరు

హిందుత్వకు బీజేపీ వక్రభాష్యం: కె.కేశవరావు


హైదరాబాద్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): హిందుత్వకు బీజేపీ వక్రభాష్యం చెబుతోందని, అన్ని వర్గాలనూ ఆదరించేదే హిందూ మతమని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు అన్నారు. కేసీఆర్‌ కంటే నిజమైన హిందువు ఎవరూ లేరని, ఆయన చేసినన్నీ పూజలు, యాగాలు తాను కూడా చేయలేదని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో శనివారం మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా టికెట్ల కేటాయింపులో టీఆర్‌ఎస్‌ సామాజిక న్యాయాన్ని పాటించిందన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, ప్రలోభాలకు గురిచేసేలా అరాచక వాగ్ధానాలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితుల పరిస్థితి ఎలా ఉందో ప్రజలు గమనించాలన్నారు.

Updated Date - 2020-11-22T09:39:44+05:30 IST