కేశినేని ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం

ABN , First Publish Date - 2021-12-02T02:27:41+05:30 IST

లోక్‌సభలో ఎంపీ కేశినేని నాని ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానమిచ్చింది. తెలుగురాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలే ధాన్యం సేకరణ చేస్తున్నాయని

కేశినేని ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం

ఢిల్లీ: లోక్‌సభలో ఎంపీ కేశినేని నాని ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానమిచ్చింది. తెలుగురాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలే ధాన్యం సేకరణ చేస్తున్నాయని కేంద్రం తెలిపింది. ఏపీ కంటే తెలంగాణ నుంచే ఎక్కువ బియ్యం సేకరించామని పేర్కొంది. 2019, 20లో ఏపీ నుంచి 55.33 లక్షల మెట్రిక్ టన్నులు, తెలంగాణలో 74.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని కేంద్రం ప్రకటించింది. 2020, 21లో ఏపీ నుంచి 56.67 లక్షల మెట్రిక్ టన్నులు, తెలంగాణ నుంచి 94.53 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని కేంద్రం తెలిపింది.

Updated Date - 2021-12-02T02:27:41+05:30 IST