విజయవాడను ముఠాకోరు నగరంగా మార్చారు: కేశినేని నాని

ABN , First Publish Date - 2021-08-25T19:13:02+05:30 IST

జగన్మోహన్ రెడ్డి పాలనలో గంజాయి యుద్ధాలు జరుగుతున్నాయని టీడీపీ ఎంపీ కేశినేని విమర్శించారు.

విజయవాడను ముఠాకోరు నగరంగా మార్చారు: కేశినేని నాని

విజయవాడ: జగన్మోహన్ రెడ్డి పాలనలో గంజాయి యుద్ధాలు జరుగుతున్నాయని టీడీపీ ఎంపీ కేశినేని విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడను ముఠాకోరు నగరంగా మార్చారన్నారు. టీడీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతూ.. వైసీపీ నేతలకు రాచబాట వేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయని, జగన్ పాలనలో అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేశినేని నాని అన్నారు.

Updated Date - 2021-08-25T19:13:02+05:30 IST