2024లో పోటీ చేయనని ఎవరితోనూ అనలేదు: కేశినేని నాని

ABN , First Publish Date - 2021-09-30T23:49:06+05:30 IST

2024లో పోటీ చేయనని ఎవరితోనూ అనలేదని ఎంపీ కేశినేని నాని చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

2024లో పోటీ చేయనని ఎవరితోనూ అనలేదు: కేశినేని నాని

అమరావతి: 2024లో పోటీ చేయనని ఎవరితోనూ అనలేదని ఎంపీ కేశినేని నాని చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారికి సముచిత స్థానం కల్పించాలని అధినేతకు చెప్పానని తెలిపారు. ఎవ్వరూ అధైర్యపడనవసరం లేదన్నారు. కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండి పార్టీ కోసం పోరాడాలని కోరారు. దుర్గమ్మ ఆశీస్సులు ఉన్నంతకాలం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని కేశినేని నాని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని నెల రోజుల క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబుకు నాని చెప్పారని ప్రచారం జరుగుతోంది. తన కుమార్తె కూడా పోటీ చేయబోదని చంద్రబాబుతో నాని చెప్పారని చెబుతున్నారు. ఇప్పటికే తన కుమార్తె టాటా ట్రస్ట్‌కు వెళ్లిపోయిందని కేశినేని పేర్కొన్నారు. అయితే పార్టీలోనే కొనసాగుతానని చంద్రబాబుకు కేశినేని వివరించారు. ఈసారి వేరే అభ్యర్థిని చూసుకోవాలని చంద్రబాబుకు కేశినేని సూచించారని ప్రచారం జరగింది.

Updated Date - 2021-09-30T23:49:06+05:30 IST