Hyderabad బాలిక హత్య కేసులో కీలక ఆధారాలు.. నిందితులు వీళ్లే..
ABN , First Publish Date - 2021-11-11T14:30:49+05:30 IST
హైదరాబాద్లోని బంజారాహిల్స్లో గుర్తు తెలియని ఓ చిన్నారి మృతదేహం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ..
హైదరాబాద్ సిటీ/పంజాగుట్ట : హైదరాబాద్లోని బంజారాహిల్స్లో గుర్తు తెలియని ఓ చిన్నారి మృతదేహం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దుకాణం ఎదుట వదిలి వెళ్లిన ఈ మృతదేహం కుడిచేయి వెనక్కితిప్పినట్టుగా ఉండడం, సంబంధీకులెవరూ ఫిర్యాదు చేయకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. ఈ కేసుకు సంబంధించి నగర పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.
ఇవే కీలక ఆధారాలు..
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో వెలుగుచూసిన బాలిక మృతి కేసు కొలిక్కి వస్తోంది. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు వచ్చిన వాహనాన్ని గుర్తించి, వాహన డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారించగా పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. నిందితులు నాంపల్లి నుంచి పంజాగుట్ట మోడల్ హౌస్ వరకు ఆటోలో వచ్చారు. అక్కడి నుంచి బాలిక మృతదేహాన్ని పట్టుకుని ద్వారకాపురి కాలనీ వీధుల్లో నడుచుకుంటూ తిరిగారు. మృతదేహాన్ని పడేయడానికి అనువైన ప్రాంతం కోసం గాలించారు. మూసి ఉన్న దుకాణం షట్టర్ ముందు మృతదేహాన్ని పడేసి బంజారాహిల్స్ రోడ్ నెంబర్-01 వైపు నడుచుకుంటూ వెళ్లిపోయారు. నిందితులు నగరానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.