లోన్‌యాప్‌ కేసుల్లో మరో కీలక వ్యక్తి అరెస్టు

ABN , First Publish Date - 2021-04-29T17:11:51+05:30 IST

లోన్‌యాప్‌ల కేసు దర్యాప్తులో భాగంగా మరో కీలక వ్యక్తిని సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు

లోన్‌యాప్‌ కేసుల్లో మరో కీలక వ్యక్తి అరెస్టు

  • బెంగళూరుకు చెందిన కలప్ప అరెస్టుతో మొత్తం 22మంది


హైదరాబాద్‌ సిటీ : లోన్‌యాప్‌ల కేసు దర్యాప్తులో భాగంగా మరో కీలక వ్యక్తిని సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు, రిచ్‌మండ్‌ రోడ్‌ నివాసి బి.కె.కలప్ప ఫైన్‌ఎక్స్‌ప్రెస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. అతడి కంపెనీ ద్వారా హై క్యాష్‌ యాప్‌ అనుసంధానించి ఉంది. దర్యాప్తులో భాగంగా అతను డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న కంపెనీ లావాదేవీలపై దృష్టి సారించిన పోలీసులు ఎట్టకేలకు అతడ్ని బుధవారం బెంగళూరులో అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఓ చైనీయుడు (జూవీ అలియాస్‌ ల్యాంబో), ప్రధాన నిందితులు కె.నాగరాజు, సింగి మధుబాబు, పల్లె జీవనజ్యోతిలతోపాటు మొత్తం 22మందిని అరెస్టు చేసినట్లు సైబర్‌క్రైమ్‌ పోలీసులు తెలిపారు. తాజా విచారణలో పలు నకిలీ కంపెనీలను గుర్తించిన అధికారులు పలు ఖాతాలను సీజ్‌ చేసి రూ.400కోట్లను ఫ్రీజ్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Updated Date - 2021-04-29T17:11:51+05:30 IST