ఏకాదశ రుద్ర మహాగణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు..
ABN , First Publish Date - 2021-06-24T18:14:45+05:30 IST
ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి ఏకాదశ రుద్ర మహాగణపతిగా భక్తులకు కనువిందు చేయనున్నాడు.
హైదరాబాద్: ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి ఏకాదశ రుద్ర మహాగణపతిగా భక్తులకు కనువిందు చేయనున్నాడు. ఏర్పాట్లలో భాగంగా గణపతి ప్రాంగణంలో కర్రపూజ చేశారు. కరోనా కారణంగా ఉత్సవాల నిర్వహణ, గణేషుడి ఎత్తుపై సందిగ్ధత నెలకొంది. త్వరలోనే అన్ని విషయాలు చెబుతామని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అన్నారు.
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా వినాయకచవితి అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణేషుడే.. కరోనా కారణంగా గత ఏడాది నామమాత్రంగానే వేడుకలు జరిగాయి.