క్షుద్ర పూజల అనుమానం.. పన్ను పీకించిన వైనం..

ABN , First Publish Date - 2021-06-29T21:23:40+05:30 IST

తమ ఇంట్లో 9 నెలల బాబు మృతికి పక్కింట్లోని కుటుంబం వారే కారణమంటూ మహిళ పన్ను...

క్షుద్ర పూజల అనుమానం.. పన్ను పీకించిన వైనం..

మధిర (ఖమ్మం జిల్లా): తమ ఇంట్లో 9 నెలల బాబు మృతికి పక్కింట్లోని కుటుంబం వారే కారణమంటూ మహిళ పన్ను పీకించిన సంఘటన ఖమ్మం జిల్లా, మధిరలో కలకలం రేపింది. ఎస్సీ కాలనీలో గద్దల బుజ్జికి 9 నెలల కుమారుడు ఉన్నాడు. అనారోగ్యంతో బాధపడిన ఆ చిన్నారి కోసం రూ. 2 లక్షలు ఖర్చు చేశారు. చివరికి ఆ బాలుడు ఇటీవల చనిపోయాడు. అయితే తమ కుమారుడి మృతికి పక్కింట్లో ఉంటున్న గద్దల మోహనరావు, ఆయన భార్య సుగుణ కారణమని బుజ్జికి అనుమానం కలిగింది. దీనికితోడు బుజ్జి ఇంటి ముందు నిమ్మకాయలు, పసుపు, కుంకుమ జల్లి ఉండడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి.


బుజ్జి కుటుంబం మోహనరావు ఇంటికి వెళ్లింది. అక్కడ క్షుద్ర పూజలు చేసిన సామాగ్రి దొరికింది. దీంతో తమ చిన్నారి మృతికి వారే కారణమని బుజ్జి ఆగ్రహించాడు. వారిని చితకబాదాడు. అంతేకాడు భర్త మోహనరావుతోనే సుగుణ పన్ను పీకించారు. దీంతో వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-06-29T21:23:40+05:30 IST