Khammam: భక్తులతో కిక్కిరిసిన శివాలయాలు
ABN , First Publish Date - 2021-11-08T13:38:43+05:30 IST
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శివాలయాలు భక్తులతో కిక్కిరిశాయి.
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శివాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. కార్తీక మాసం మొదటి సోమవారంతో పాటు నాగులచవితి పండుగ కలసి రావటంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. శివ నామస్మరణలతో శివాలయాలు మారుమ్రోగుతున్నాయి. తెల్లవారుజాము నుండే శివాలయాలలో భక్తులు బారులు తీరారు. పంచామృతం అభిషేకాలు, బిల్వదళార్చనలు నిర్వహిస్తున్నారు.