ఏసీ మిర్చికి రికార్డు ధర
ABN , First Publish Date - 2020-09-26T11:29:53+05:30 IST
ఏసీ మిర్చికి ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్తాయిలో ధర పలికింది.
ఖమ్మంమార్కెట్, సెప్టెంబరు 25: ఏసీ మిర్చికి ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్తాయిలో ధర పలికింది. ఈ సీజన్లో తొలిసారిగా క్వింటా మిర్చి ధర రూ.20,175 పలకగా.. శుక్రవారం వ్యాపారులు పోటీపడి జెండా పాట నిర్వహించారు. దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో మిర్చి ధరలు ఊపందుకున్నాయి.
ఏసీ మిర్చీకి ఈ పది రోజుల్లోనే క్రమక్రమంగా రూ.ఆరువేలు పెరిగింది. కొనుగోళ్లను మార్కెట్ కమిటీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ, వైస్చైర్మన్ పిన్ని కోటేశ్వరరావు, మార్కెట్ సెక్రటరీ రుద్రాక్షల మల్లేశం తదితరులు పర్యవేక్షించారు.