ఇరుజిల్లాల్లో 320మందికి కొవిడ్
ABN , First Publish Date - 2020-09-26T11:27:33+05:30 IST
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం మరో 320మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 236, ఖమ్మం జిల్లాలో 84పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కొత్తగూడెం కలెక్టరేట్ / ఖమ్మం సంక్షేమ విభాగం, సెప్టెంబరు 25: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం మరో 320మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 236, ఖమ్మం జిల్లాలో 84పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి జిల్లాలో శుక్రవారం మొత్తం 2,196మందికి పరీక్షలు నిర్వహించగా 236మంది కరోనా బారిన పడ్డారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఖమ్మం జిల్లాలో 84మందికి కొవిడ్ లక్షనాలున్నట్టు నిర్ధారణైందని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించిన రోజువారీ నివేదికలో పేర్కొన్నారు.