సీఎం జగన్‌‌తో కియా ఇండియా ఎండీ భేటీ

ABN , First Publish Date - 2021-11-17T02:00:33+05:30 IST

ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కియా ఇండియా

సీఎం జగన్‌‌తో కియా ఇండియా ఎండీ భేటీ

అమరావతి: ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం  వైఎస్‌ జగన్‌ను కియా ఇండియా నూతన ఎండీ, సీఈవో టే–జిన్‌ పార్క్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున తమకు పూర్తి సహాయ సహకారాలు అందించడంపై సీఎంకి కియా ఇండియా మేనేజ్‌మెంట్‌ కృతజ్ఞతలు తెలియజేసింది. ఏపీ ప్రభుత్వ సహకారం వల్లే తాము అనుకున్న ఉత్పత్తి సామర్ధ్యానికి మించి కార్లను తయారుచేసి, మార్కెటింగ్‌ చేయగలిగినట్లు ముఖ్యమంత్రికి కియా ఇండియా మేనేజ్‌మెంట్‌ టీం వివరించారు.  ఏపీలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, పారిశ్రామిక వర్గాలకు ఇస్తున్న ప్రోత్సాహకాలపై కియా ఇండియా టీంతో సీఎం చర్చించారు.  కియా ఇండియా నూతన ఎండీ, సీఈవో టే–జిన్‌ పార్క్‌‌ని జగన్‌ సన్మానించి జ్ఞాపిక అందజేశారు. సమావేశంలో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కియా ఇండియా చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ కబ్‌ డాంగ్‌ లీ, లీగల్, కార్పొరేట్‌ ఎఫైర్స్‌ హెవోడీలు జూడ్‌ లీ, యాంగ్‌ గిల్‌ మా, ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌ డాక్టర్‌ టి.సోమశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-17T02:00:33+05:30 IST