ఏజెన్సీలో ఉద్యోగాలన్నీ గిరిజనులకే చెందాలి

ABN , First Publish Date - 2020-12-03T06:26:21+05:30 IST

ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలన్నింటినీ స్థానిక గిరిజనులకే కేటాయించేలా శాసనసభలో తీర్మానం చేయాలని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

ఏజెన్సీలో ఉద్యోగాలన్నీ గిరిజనులకే చెందాలి
అరకులోయ టీడీపీ నాయకులతో మాజీ మంత్రి శ్రావణ్‌కుమార్‌

ఏజెన్సీలో ఉద్యోగాలన్నీ గిరిజనులకే చెందాలి


అరకులోయ, డిసెంబరు 2: ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలన్నింటినీ స్థానిక గిరిజనులకే కేటాయించేలా శాసనసభలో తీర్మానం చేయాలని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. నియోజకవర్గం స్థాయి టీడీపీ నాయకులతో అరకులోయలో బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్‌కు గిరిజనులపై అభిమానం వుంటే సుప్రీంకోర్టు రద్దు చేసిన జీవో-3ని పునరుద్ధరించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. గవర్నర్‌ కూడా జోక్యం చేసుకొని, గిరిజనులకు రాజ్యాంగం  కల్పించిన  హక్కులకు భంగం వాటిల్లకుండా చూడాలని కోరారు. జీవో-3ని రద్దు చేయకపోతే ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో గిరిజనులకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు శెట్టి బాబురావు, శెట్టి అప్పాలు, సమర్ది రఘునాథ్‌, పాండురంగస్వామి, అమ్మన్న, సాయి, మహదేవ్‌, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-03T06:26:21+05:30 IST