ప్రియుడిని కిడ్నాప్ చేయించి.. పెళ్లాడి!
ABN , First Publish Date - 2022-01-27T08:09:06+05:30 IST
భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న ఓ మహిళ, మరో వ్యక్తితో వివాహేతర సంబం ధం పెట్టుకుంది. పైగా తనతో వివాహానికి అతడు అంగీకరించలేదనే కోపంతో ఓ సుపారీ గ్యాంగ్తో కిడ్నాప్ చేయించింది. భయపెట్టి.. బలవంతంగా దం డలు మార్పించి పెళ్లి చేసుకుంది. ...
సుపారీ గ్యాంగ్తో కలిసి వివాహిత నిర్వాకం
నర్సంపేట టౌన్, జనవరి 26: భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న ఓ మహిళ, మరో వ్యక్తితో వివాహేతర సంబం ధం పెట్టుకుంది. పైగా తనతో వివాహానికి అతడు అంగీకరించలేదనే కోపంతో ఓ సుపారీ గ్యాంగ్తో కిడ్నాప్ చేయించింది. భయపెట్టి.. బలవంతంగా దం డలు మార్పించి పెళ్లి చేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. నర్సంపేట శివారులోని కమలాపురానికి చెందిన ముత్యం శ్రీను నర్సంపేటలో మద్యం షాపు నిర్వహిస్తూనే ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ వివాహితకు రోజువారీ వసూలు కింద కొంత అప్పుగా ఇచ్చాడు. వసూలు కోసం తరచూ ఆమె ఇంటికి వెళ్లడంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఇది తెలిసి ఆ మహిళ భర్త ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయాడు. అయితే.. శ్రీను వల్లే తన కాపురం దెబ్బతిన్నదంటూ ప్రియుడిని ఆమె నిలదీసింది. 2 నెలల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరిగింది. నష్టపరిహారంగా గతంలో ఇచ్చిన అప్పును మాఫీ చేసి మహిళకు శ్రీను అదనంగా రూ.1.5 లక్షలు ఇవ్వాలని తీర్మానం చేశారు. అనంతరం ఆ వివాహిత ప్రియుడు శ్రీనునే పెళ్లి చేసుకొని, కొంత ఆస్తిని దక్కించుకోవాలని ప్లాన్ వేసింది. శ్రీను కిడ్నాప్ కు ఓ సుపారీ గ్యాంగ్తో ఒప్పందం కుదుర్చుకుంది.
బుధవారం పట్టణ శివారులో గ్యాంగ్ సభ్యులతో కలిసి శ్రీనును బలవంతంగా కారులో ఎక్కించుకొని పాకాల వైపు వెళ్లింది. స్థానికులు శ్రీను కుటుంబ సభ్యులకు తెలపడంతో బాధితుడి కుమారుడు భరత్ పోలీసుల కు ఫిర్యాదు చేశాడు. తమను పోలీసులు వెంబడిస్తున్నారని గ్రహించిన సుపారీ గ్యాంగ్ శ్రీనును, మహిళ ను గంజేడు అడవిలోకి తీసుకెళ్లి దండలు మార్పించి ఫొటోలు తీశారు. కొంత ఆస్తిని రాసివ్వాలన్నారు. పెద్ద మనుషుల వద్ద మాట్లాడుకుందామని అతడు చెప్పడంతో నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదురుగా మహిళ ఇంట్లో అతడిని వదిలేసి పరారయ్యారు. శ్రీనును పోలీ్సస్టేషన్లో విచారిస్తున్నారు.