తాడేపల్లిలో కిడ్నాప్ కలకలం.. దొరికిన దొంగలు
ABN , First Publish Date - 2020-05-31T18:00:46+05:30 IST
తాడేపల్లిలో కిడ్నాప్ కలకలం రేపుతోంది.
గుంటూరు జిల్లా: తాడేపల్లిలో కిడ్నాప్ కలకలం రేపుతోంది. పాతనేరస్తులు విజయవాడకు చెందిన వ్యాపారిని కిడ్నాప్ చేసి.. రూ. 5 లక్షలు డిమాండ్ చేశారు. బాధితుడి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. అయితే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసం ఉండే ప్రాంతంలో పాత నేరస్తుల కదలికలు చురుగ్గా ఉండడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది.
గత మూడు నెలలుగా ఆర్థికవనరులు సరిగా లేకపోవడంతో పాత నేరస్తులు యాక్టివ్ అయినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ సమస్యను అధిగమించడం కోసం ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.