కిడ్నీ రోగి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-10-17T06:28:25+05:30 IST
గత ఆరేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఓ రోగి శుక్రవారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ మొదటి అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
కర్నూలు(హాస్పిటల్), అక్టోబరు 16 : గత ఆరేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఓ రోగి శుక్రవారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ మొదటి అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా కలుగల్లుకు చెందిన కోటయ్య ఈ నెల 12వ తేదీ కిడ్నీ సమస్యతో యురాలజీ వార్డులో చేరాడు. భార్యను, కుమారుడ్ని నీళ్ల కోసం పంపించి మొదటి అంతస్థు నుంచి కిందికి దూకాడు. దీంతో అతడ్ని చికిత్స కోసం క్యాజువాల్టీకి పంపారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ప్రమాదవశాత్తు పై నుంచి కింద పడ్డాడని ఆసుపత్రి సిబ్బంది అంటున్నారు. ఈ ఘటన జరుగుతోంటే సెక్యూరిటీ సిబ్బంది గమనించకపోవడం చర్చనీయాంశమైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.