మేమే మీకు అల్టిమేటం ఇస్తున్నాం: కిలారి రోశయ్య

ABN , First Publish Date - 2020-08-05T18:41:26+05:30 IST

గుంటూరు: వైసీపీ మ్యానిఫెస్టోలో అమరావతి తరలింపుపై మాట్లాడలేదు అని చంద్రబాబు అంటున్నారని..

మేమే మీకు అల్టిమేటం ఇస్తున్నాం: కిలారి రోశయ్య

గుంటూరు: వైసీపీ మ్యానిఫెస్టోలో అమరావతి తరలింపుపై మాట్లాడలేదు అని చంద్రబాబు అంటున్నారని.. కావాలంటే మేనిఫెస్టో చూడాలని వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య పేర్కొన్నారు. అమరావతి నుంచి రాజధానిని మార్చటం లేదన్నారు. వేల ఎకరాలు, కోట్ల రూపాయలు వసూలు చేస్తాం అని చంద్రబాబు మ్యానిఫెస్టోలో పెట్టారా? అని ప్రశ్నించారు. రైతుల నుంచి బలవంతంగా భూముల లాక్కున్నారన్నారు. 5 ఏళ్ళలో ఎక్కడా అభివృద్ధి చేయలేదన్నారు. జగన్ సర్కారు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉందన్నారు. మీరు మాకు అల్టిమేటం ఇవ్వటం కాదని.. మేమే మీకు అల్టిమేటం ఇస్తున్నామన్నారు. మీకు నైతిక విలువలు ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళాలని కిలారి రోశయ్య పేర్కొన్నారు.


Updated Date - 2020-08-05T18:41:26+05:30 IST