పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-12-12T01:24:14+05:30 IST

జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. తన ఇద్దరు పిల్లలను చంపి ఆపై తాను ఆత్మహత్యకు ఓ తల్లి పాల్పడింది. స్థానికులు తెలిపిన ప్రకారం భర్త వేధింపులు తాళలేక పిల్లలు శ్రీయ(4), తన్వీక్(5)లతో కలిసి స్వాతి అనే గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. స్వాతి భర్త సాయి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గతకొంతకాలంగా ఉప్పర్‌పల్లి ఫోర్ట్ వ్యూ కాలనీ శ్రీనివాస్ అపార్ట్ మెంట్‌లో వీరు నివాసం ఉంటున్నారు. మధ్యాహ్నం నుంచి భర్తతో స్వాతికి గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన స్వాతి తన గదిలో గోడకు పెన్నుతో సూసైడ్ నోట్ రాసింది.


బెడ్రూంలో తన ఇద్దరు పిల్లలను ఫ్యానుకు ఉరివేసి, వారు చనిపోయారని నిర్ధారించుకున్నాక ఆపై తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త ఇంట్లో ఉన్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. భార్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకొని అక్కడి నుంచి భర్త పరార్ అయ్యాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-12-12T01:24:14+05:30 IST