మూడోదశ కరోనా చికిత్స కేంద్రంగా.. కింగ్‌కోఠి ఆస్పత్రి

ABN , First Publish Date - 2020-03-30T10:14:17+05:30 IST

కరోనా మూడోదశ చికిత్స కేంద్రంగా ప్రభుత్వం కింగ్‌కోఠి ఆస్పత్రిని తీర్చిదిద్దింది. 300 పడకలను ఐసోలేషన్‌కు, మరో 50 పడకలను ఐసీయూకు కేటాయించారు.

మూడోదశ కరోనా చికిత్స కేంద్రంగా.. కింగ్‌కోఠి ఆస్పత్రి

ఆబిడ్స్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): కరోనా మూడోదశ చికిత్స కేంద్రంగా ప్రభుత్వం కింగ్‌కోఠి ఆస్పత్రిని తీర్చిదిద్దింది. 300 పడకలను ఐసోలేషన్‌కు, మరో 50 పడకలను ఐసీయూకు కేటాయించారు. ఇప్పటి వరకు ఇక్కడ ఇతర వ్యాధులతో చికిత్స పొందుతున్న రోగులను ఉస్మానియా, నిలోఫర్‌, సుల్తాన్‌బజార్‌ ప్రసూతి ఆస్పత్రులకు తరలించారు. వైద్యనిపుణులు అందుబాటులో ఉన్న కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రిని పూర్తిస్థాయిలో కరోనా చికిత్సకు వినియోగించనున్నారు. ఇక్కడ ఇప్పటికే ఉన్న ఐదుగురు వైద్యనిపుణులకు తోడు.. 14 మంది అనస్థీషియా, పల్మనాలజి, జనరల్‌ ఫిజీషియన్‌ విభాగాల స్పెషలిస్టులను తాజాగా నియమించారు. వీరితోపాటు.. మరో 17 మంది వైద్యులు ఇక్కడ పనిచేస్తున్నారు. 

Updated Date - 2020-03-30T10:14:17+05:30 IST