మనోభావాలు దెబ్బతినేలా సోషల్మీడియాలో పోస్టింగ్స్!
ABN , First Publish Date - 2021-07-02T14:34:06+05:30 IST
భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్మీడియాలో...
- యువకుడి అరెస్టు
హైదరాబాద్ సిటీ/హిమాయత్నగర్ : భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్మీడియాలో పోస్టుచేస్తున్న యువకుడిని సిటీ సైబర్క్రైమ్స్ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సంగారెడ్డి జిల్లా జిన్నారానికి చెందిన కిరణ్కుమార్ కొంతకాలంగా సోషల్మీడియాలో షిర్డీ సాయిబాబాను కించపరిచేలా వరుసగా పోస్టింగులు పెడుతూ వస్తున్నాడు. ఇటీవల ఏకంగా యాంటీ సాయిబాబా గ్రూప్ పేరుతో ఒక సోషల్మీడియా గ్రూప్ను ఏర్పాటుచేసి ఫొటోలను, అసభ్యకరంగా వ్యాఖ్యలను పోస్టు చేస్తున్నాడు. దీంతో కొందరు భక్తులు సైబర్క్రైమ్స్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు కిరణ్కుమార్ను అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు.