ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా కిరణ్‌

ABN , First Publish Date - 2022-01-28T06:34:44+05:30 IST

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా కిరణ్‌ను ఎన్నుకున్నారు.

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా కిరణ్‌
అధ్యక్షుడిగా ఎంపికైన కిరణ్‌

పీలేరు, జనవరి 27: ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కార్యవర్గ ఎంపిక ఏకగ్రీవంగా జరిగింది. గురువారం పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.వినాయకం ఈ వివరాలను వెల్లడించారు. జిల్లా సంఘం గౌరవాధ్యక్షులుగా పి.కిరణ్‌కుమార్‌(పీలేరు), శ్రీరాములు నాయక్‌(కేవీపల్లె), ప్రధాన కార్యదర్శిగా రాజీవ్‌గాంధీ(ఐరాల), ఆర్థిక విభాగ కార్యదర్శిగా సుబ్రహ్మణ్యం(చౌడేపల్లె), అసోసియేట్‌ అధ్యక్షుడిగా ఎం.ప్రభాకర్‌(చిత్తూరు), అదనపు కార్యదర్శిగా ఎం.ప్రభుకుమార్‌(చిత్తూరు), ఉపాధ్యక్షులుగా పాపయ్య(చిత్తూరు), గుణశేఖర్‌(యాదమర్రి), బొజ్జయ్య(తవణంపల్లె), మునికృష్ణయ్య(ఎస్‌ఆర్‌పురం), వెంకటరమణ(సదుం), చెన్నకేశవులు(సోమల), వెంకటేష్‌(బీఎన్‌కండ్రిగ), గౌతమ్‌కుమార్‌(వి.కోట), రవి(శాంతిపురం), కరుణాకర్‌(మదనపల్లె)ను ఎన్నుకున్నట్లు వినాయకం వివరించారు. సంఘ కార్యదర్శులుగా పదిమందిని, కార్యనిర్వాహక కార్యదర్శులుగా ఐదుగురిని, సలహాదారులుగా ముగ్గురిని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-28T06:34:44+05:30 IST