కిరణ్‌ హత్యకేసును తప్పుదోవ పట్టిస్తున్నారు

ABN , First Publish Date - 2020-08-04T10:02:12+05:30 IST

మర్రిపల్లిలో దళిత యువకుడు కిరణ్‌ హత్యకేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ

కిరణ్‌ హత్యకేసును తప్పుదోవ పట్టిస్తున్నారు

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ


శంషాబాద్‌ రూరల్‌: మర్రిపల్లిలో దళిత యువకుడు కిరణ్‌ హత్యకేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అరోపించారు. సోమవారం శంషాబాద్‌ జోన్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి వినత్రిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కిరణ్‌ హత్య కేసును తప్పుదోవ పట్టిస్తున్న ఏసీపీ, సీఐ, ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డీసీపీని కోరినట్లు తెలిపారు. హత్యకేసు ఫిర్యాదు ఇతరులతో ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. రీ పోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటుంబసభ్యులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


అసలైన నిందితుడు ఏదుల మహేష్‌ను తప్పిం చేందుకు పోలీసులు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. డీసీపీ ప్రకాశ్‌రెడ్డి పోలీసుల తీరు తన దృష్టికి వచ్చిన్నట్లు తెలిపారని, విచారణ జరిపి బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటానని డీసీపీ హామీ ఇచ్చినట్లు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఆయన వెంట లక్ష్మినివాస్‌, శ్రీనివాస్‌, బాబు, రమేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-04T10:02:12+05:30 IST