కిసాన్ అధికార్ దివాస్ను విజయవంతం చేయాలి
ABN , First Publish Date - 2021-01-17T04:55:31+05:30 IST
రైతు నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 19వ తేదీన విజయవాడలో చేపట్టే కిసాన్ అధికార్ దివాస్ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవకుమార్రెడ్డి పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రణాళికలు
డీసీసీ అధ్యక్షుడు చేవూరు దేవకుమార్రెడ్డి
నెల్లూరు(వైద్యం) జనవరి 16 : రైతు నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 19వ తేదీన విజయవాడలో చేపట్టే కిసాన్ అధికార్ దివాస్ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవకుమార్రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరులోని ఇందిరాభవన్లో శనివారం నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చేవూరు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నియోజనవర్గాల ఇన్చార్జులు, ముఖ్య నేతలు కిసాన్ దివాస్ సదస్సులో తప్పక పాల్గొనాలన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేసేలా సిద్ధంగా ఉండాలని కోరారు. స్థానిక సంస్ధల ఎన్నికల్లో పార్టీ విజయం సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లాలో కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్ ప్రారంభించటం సంతోషకరన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సీవీ శేషారెడ్డి, అసెంబ్లీ నియోజనవర్గాల ఇన్చార్జులు ఉడతా వెంకట్రావ్, ఫయాజ్, పరిమళ వెంకటేశ్వర్లు, దద్దుకూరు రమేష్ నాయుడు, డీసీసీ ఉపాధ్యక్షుడు తలారి బాలసుధాకర్, ఏటూరి శ్రీనివాసులురెడ్డి, అల్లాఉద్దీన్, పప్పర్తి గణేష్బాబు, హుస్సేన్బాషా, సురేష్బాబు, మహేష్రెడ్డి పాల్గొన్నారు.