ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని నమ్మిన వాడిని: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-12-21T00:54:51+05:30 IST

వర్గీకరణపై అనేక సార్లు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా సహా అందరు ముఖ్యులతో చర్చించానని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని నమ్మిన వాడిని: కిషన్‌రెడ్డి

హైదరాబాద్: వర్గీకరణపై అనేక సార్లు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా సహా అందరు ముఖ్యులతో చర్చించానని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మరొకసారి కేంద్ర పెద్దలతో మాట్లాడతానని తెలిపారు. మంత్రి పదవి శాశ్వతం కాదు, ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని నమ్మిన వాడినన్నారు. మూడు శాఖల వల్ల పని ఒత్తిడి బాగా పెరిగిందని పేర్కొన్నారు. ఎమ్మార్పీఎస్ విషయంలో పార్టీలో వత్తిడి, సంఘాల నుండి ఒత్తిడి వచ్చినా భరించాను కానీ పని చేశానని చెప్పారు. తాను మంత్రిగా రాలేదు, ఎమ్మార్పీఎస్ కార్యకర్తగా వచ్చానని గుర్తుచేశారు. తాను పెద్దలుతో మాట్లాడిన విషయాలు బయటకు చెప్పకూడదన్నారు. ఉద్యమం అంశంలో ఏరోజు వెనకడుగు వేయలేదని, ఉద్యమానికి తన వంతుగా సహకారం అందిస్తానని చెప్పారు. 

Updated Date - 2021-12-21T00:54:51+05:30 IST