పాతబస్తీలో రోహింగ్యాలు ఉన్నారన్న సమాచారం ఉంది: కిషన్రెడ్డి
ABN , First Publish Date - 2020-11-26T20:35:20+05:30 IST
హైదరాబాద్లో శాంతి భద్రతలకు విఘాతం ఎవరు కల్పిస్తున్నారో సీఎం బయటపెట్టాలని కిషన్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: నగరంలో శాంతి భద్రతలకు విఘాతం ఎవరు కల్పిస్తున్నారో ముఖ్యమంత్రే బయటపెట్టాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్ సమస్యలుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఫిర్యాదు చేస్తే.. కేంద్రం రోహింగ్యాలను వెనక్కి పంపిస్తుందని అన్నారు. పాతబస్తీలో రోహింగ్యాలు ఉన్నారన్న సమాచారం తమవద్ద ఉందని కిషన్రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమస్యలను వదిలేసి ముఖ్యమంత్రి కేటీఆర్ జాతీయ అంశాలను మాట్లాడటం చేతకాని తనమని కిషన్ రెడ్డి అన్నారు. మహానాయకులు ఎన్టీఆర్, పీవీలను బీజేపీ గౌరవిస్తోందన్నారు. బెంగళూరు సౌత్ ఎంపీ, భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్యపై ఓయూ పోలీసులు కేసు నమోదు చేయటాన్ని ఖండిస్తున్నానని కిషన్ రెడ్డి అన్నారు.