యువత అల్లూరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-01-02T19:56:54+05:30 IST

లంబసింగిలో‌ 35కోట్లు, హైదరాబాద్‌లో 18కోట్లతో అల్లూరి సీతారామరాజు మ్యూజియంలు నిర్మిస్తున్నామని, వీలైనంత త్వరగా మ్యూజియంలను నిర్మించి జాతికి అంకితం చేయాలని రెండు ప్రభుత్వాలను కోరుతున్నానని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

యువత అల్లూరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి:  కిషన్‌రెడ్డి

హైదరాబాద్: నేటి యువత అల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. ఆదివారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అల్లూరి  మ్యూజియాలను లంబసింగిలో‌ 35కోట్లు, హైదరాబాద్‌లో 18కోట్లతో నిర్మిస్తున్నామని, వీలైనంత త్వరగా మ్యూజియాలను నిర్మించి జాతికి అంకితం చేయాలని రెండు ప్రభుత్వాలను కోరుతున్నానని  అన్నారు. అల్లూరి సీతారామరాజు సినిమా ద్వారానే స్వాతంత్ర్య ఉద్యమం గురించి తెలుసుకున్నానని చెప్పారు. స్వాతంత్ర్య ఉద్యమంలో గుర్తింపు పొందని సమరయోధులను కేంద్రం గౌరవిస్తోందన్నారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరగబోయే అల్లూరి సీతారామరాజు కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీని తీసుకురావడానికి ప్రయత్నిస్తానని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

‘‘నేను స్వతహాగా సూపర్ స్టార్ కృష్ణ అభిమానిని.‌ చిన్నప్పుడు ఆయన సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. అల్లూరి సీతారామరాజు సినిమాను నాలుగైదు సార్లు చూశా. ఈనెల 13న అల్లూరి స్వగ్రామం మోగులును సందర్శిస్తా’’ అని  కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-02T19:56:54+05:30 IST