తెలంగాణకు కేంద్ర బృందాన్ని పంపిస్తున్నాం: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-10-21T19:43:04+05:30 IST

హైదరాబాద్: విస్తారంగా కురిసిన వర్షాలు, వరదల కారణంగా తెలంగాణలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.

తెలంగాణకు కేంద్ర బృందాన్ని పంపిస్తున్నాం: కిషన్‌రెడ్డి

హైదరాబాద్: విస్తారంగా కురిసిన వర్షాలు, వరదల కారణంగా తెలంగాణలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ బాగా దెబ్బతిన్నది. విపరీతంగా ఆస్తినష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు కేంద్ర బృందాన్ని పంపిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రవీణ్ వశిష్ట నేతృత్వంలోని.. ఐదుగురు సభ్యుల బృందం రేపు, ఎల్లుండి తెలంగాణలో పర్యటిస్తుందన్నారు. తెలంగాణలో జరిగిన నష్టాన్ని కేంద్ర బృందం పరిశీలిస్తుందన్నారు. వరదల్లో చనిపోయిన వారికి రూ.4 లక్షలు ఇవ్వాలని.. గతంలోనే కేంద్రం చట్టం చేసిందన్నారు. కేంద్ర సాయం అందేలోపు ఎస్డీఆర్ఎఫ్ నుంచి ఖర్చు చేయాలని కిషన్‌రెడ్డి సూచించారు. 

Updated Date - 2020-10-21T19:43:04+05:30 IST