స్కాలర్‌షి్‌పలకు నిధులు విడుదల చేయండి

ABN , First Publish Date - 2022-03-02T08:40:27+05:30 IST

ఎస్సీ, ఎస్టీ పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షి్‌పలకు సంబంధించి గత ఏడాదికిగాను రాష్ట్ర ప్రభుత్వ వాటా కింది ఇవ్వాల్సిన నిధులను..

స్కాలర్‌షి్‌పలకు నిధులు విడుదల చేయండి

సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి లేఖ


న్యూఢిల్లీ/హైదరాబాద్‌ మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షి్‌పలకు సంబంధించి గత ఏడాదికిగాను రాష్ట్ర ప్రభుత్వ వాటా కింది ఇవ్వాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన సీఎంకు లేఖ రాశారు. ఈ విద్యా సంవత్సరానికి గాను స్కాలర్‌షి్‌పల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల వివరాలను తక్షణమే ఽధ్రువీకరించి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని పేర్కొన్నారు. గతేడాది కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద రూ. 245 కోట్లు అందించిందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వ వాటాను కలుపుకొని స్కాలర్‌షి్‌పలను విడుదల చేయాలని,ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయలేదని ఆక్షేపించారు. 

Updated Date - 2022-03-02T08:40:27+05:30 IST