‘టైకీ’లో తనిఖీలకు రేపు ఎన్జీటీ బృందం
ABN , First Publish Date - 2021-04-14T06:26:45+05:30 IST
సర్పవరం జంక్షన్, ఏప్రిల్ 13: కాకినాడ రూరల్ మండలం సర్పవరంలో టైకీ బల్క్డ్రగ్ పరిశ్రమలో ఈనెల 15న తనిఖీలు చేపట్టేందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్
సర్పవరం జంక్షన్, ఏప్రిల్ 13: కాకినాడ రూరల్ మండలం సర్పవరంలో టైకీ బల్క్డ్రగ్ పరిశ్రమలో ఈనెల 15న తనిఖీలు చేపట్టేందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) బృందం రానుంది. టైకీలో మార్చి 11న రియాక్టర్ పేలి భారీ విస్ఫోటనం ద్వారా ఇద్దరు కార్మికులు మృతి చెందారు. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు, పర్యావరణానికి హాని, ప్రమాదకర రసాయనాల వినియోగంపై క్షేత్రస్థాయిలో విచారించేందుకు ఎన్జీటీ సుమోటోగా తీసుకుని ఐదుగురి సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది.