ఐపీఎల్‌లో సచిన్ రికార్డును బద్దలుగొట్టిన కేఎల్ రాహుల్

ABN , First Publish Date - 2020-09-25T02:18:24+05:30 IST

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సారథి కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు

ఐపీఎల్‌లో సచిన్ రికార్డును బద్దలుగొట్టిన కేఎల్ రాహుల్

దుబాయ్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సారథి కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో ముంబై జట్టు మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలుగొట్టాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో నేడు (గురువారం) జరుగుతున్న మ్యాచ్‌లో రాహుల్ ఈ ఘనత సాధించాడు.


రాహుల్ రెండు పరుగుల వద్ద ఉన్నప్పుడు ఈ రికార్డు అతడి సొంతమైంది. సచిన్ 63 ఇన్నింగ్స్‌లలో 2 వేల పరుగుల మైలురాయిని చేరుకోగా, రాహుల్ 60వ ఐపీఎల్ ఇన్నింగ్స్‌లోనే ఆ ఘనత అందుకున్నాడు. ఇక ఓవరాల్‌గా చూస్తూ కింగ్స్ ఎలెవన్ జట్టు ఆటగాడు క్రిస్‌గేల్ పేరున ఈ రికార్డు ఉంది. గేల్ కేవలం 48 ఇన్నింగ్స్‌లలోనే 2 వేల పరుగులు సాధించాడు.   

 

Updated Date - 2020-09-25T02:18:24+05:30 IST