ఉమ్మడి ఖమ్మంలో 29మందికి కొవిడ్
ABN , First Publish Date - 2021-01-20T04:06:27+05:30 IST
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం 29మంది కొవిడ్ బారిన పడినట్టు నిర్ధారణైంది.
కొత్తగూడెం కలెక్టరేట్ / ఖమ్మం సంక్షేమవిభాగం, జనవరి 19 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం 29మంది కొవిడ్ బారిన పడినట్టు నిర్ధారణైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 997 మందికి పరీక్షలు నిర్వహించగా 20మందికి పాజిటివ్ వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. వీరిలో కొత్తగూడెం డివిజన్లో ఆరుగురు, భద్రాచలం డివిజన్లో 14 మంది కొవిడ్ బారిన పడ్డారు. ఇక ఖమ్మం జిల్లాలో తొమ్మిది పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ అధికారులు తమ రోజువారీ నివేదికలో వెల్లడించారు.