ఉమ్మడిఖమ్మం పట్టభద్రులు.. 1,26,622
ABN , First Publish Date - 2021-01-19T05:28:42+05:30 IST
ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు సోమవారం విడుదల చేశారు. మొత్తం పట్టభద్రుల నియోకవర్గంలో 4,91,402 మంది ఓటర్లు ఉండగా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,26,622 మంది ఓటేయనున్నారు.
‘మండలి’ ఓటర్ల తుదిజాబితా విడుదల
మండలాల్లోనూ ప్రదర్శనకు జాబితా
ఖమ్మం జిల్లాలో 85,051, భద్రాద్రిలో 41,571మందికి ఓటు
మొత్తం నియోజకవర్గంలో 4,91,402మంది ఓటర్లు
ఖమ్మం కలెక్టరేట్ / ఇల్లెందు, జనవరి 18 : ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు సోమవారం విడుదల చేశారు. మొత్తం పట్టభద్రుల నియోకవర్గంలో 4,91,402 మంది ఓటర్లు ఉండగా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,26,622 మంది ఓటేయనున్నారు. వీరిలో ఖమ్మం జిల్లాలో 85051మంది, భద్రాద్రి జిల్లాలో 41,571 మంది ఓటర్లున్నారు. అయితే 2015లో జరిగిన పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో మొత్తం 2,81,138మంది ఓటర్లు ఉండగా.. ఈ ఏడాదికి మండలి ఓటర్ల సంఖ్య దాదాపు రెట్టింపై.. 4,91,402కు చేరింది. ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో గతేడాది డిసెంబరు 1 నాటికి 81,160 మంది ఉండగా.. మరోసారి ఓటునమోదుకు అవకాశాన్ని కల్పించడంతో.. మరో 3,891మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. వీరి నుంచి అర్హులను ఎంపిక చేసిన తర్వాత.. సోమవారం తుది జాబితా విడుదల చేశారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో మొత్తం 85,051 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు నమోదయ్యారు. అయితే జిల్లాలో ప్రస్తుతం107 పోలింగ్ కేంద్రాలను నిర్ణయించిన అధికారులు.. ఒక్కో కేంద్రంలో 1000 మంది చొప్పున ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. అవసరమైన చోట అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 41,571 మంది ఓటర్లుగా నమోదవగా మొత్తం 52పోలింగ్స్టేషన్లను నిర్ణయించారు. ఇదిలా ఉంటే ములుగు జిల్లాలో 9,896మంది, సిద్దిపేటలో 3,395, నల్గొండలో 88,351, సూర్యాపేటలో60,020, భూపాలపల్లిలో 12,388, జనగామలో 20,502, యాద్రాద్రి భువనగిరిలో 37,572, మహాబూబాబాద్లో 35,389, వరంగల్ అర్బన్లో 64,432, వరంగల్ రూరల్లో32,835మంది ఓటర్లుగా నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.