రేపు ప్రగతిభవన్లో ఉమ్మడి ఖమ్మం టీఆర్ఎస్ సమావేశం
ABN , First Publish Date - 2021-01-19T05:18:25+05:30 IST
పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం, ఖమ్మం కార్పొరేషన్కు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ సమావేశాన్ని హైదరాబాద్లోని ప్రగతి భవన్లో బుధవారం నిర్వహించనున్నారు.
ఖమ్మం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం, ఖమ్మం కార్పొరేషన్కు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ సమావేశాన్ని హైదరాబాద్లోని ప్రగతి భవన్లో బుధవారం నిర్వహించనున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఐటీశాఖ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలకు ఆహ్వానం అందింది. మంత్రి పువ్వాడ అజయ్కుమార్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ నామానాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, మునిసిపల్ చైర్మన్లను ఈ సమావేశానికి ఆహ్వానించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబందించి ఇప్పటికే నల్గొండ, వరంగల్ జిల్లాల నేతలతో ఇప్పటికే సమావేశాలు పూర్తవగా.. బుధవారం ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలకు, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణను నిర్వహించనున్నారు.