భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య అతని స్నేహితునితో కలిసి ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2022-01-16T08:50:58+05:30 IST

ఒక యువకుడి వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న అతని భార్య భర్తను చంపడానికి రూ.2 లక్షల సుపారీ ఇచ్చింది. సుపారీ తీసుకున్నవాడు ఆ యువకుడి స్నేహితుడే కావడం గమనార్హం. ఆ స్నేహితుడు డబ్బులకోసమే కాకుండా పగకోసం...

భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య అతని స్నేహితునితో కలిసి ఏం చేసిందంటే..

భర్త వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న అతని భార్య.. భర్తను చంపడానికి రూ.2 లక్షల సుపారీ ఇచ్చింది. సుపారీ తీసుకున్న ఆ వ్యక్తి.. ఆ యువకుడి స్నేహితుడే కావడం గమనార్హం. అతను తన స్నేహితుడిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌కు చెందిన జబల్‌పూర్ జిల్లాలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌‌ రాష్ట్రంలోని జబల్‌పూర్ జిల్లా మఛ్లా గ్రామానికి చెందిన ఉష అనే మహిళ జనవరి 11న తన భర్త నరేశ్ యాదవ్ కనబడడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జనవరి 12న పోలీసులకు నరేశ్ యాదవ్ శవం రెండు భాగాలుగా వేర్వేరు పొలాల్లో లభించింది. నరేశ్ హత్య కేసు దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు అతని మిత్రుడు అఖిలేశ్ గురించి తెలిసింది. 


నరేశ్‌ని చివరగా అతడి స్నేహితుడు అఖిలేశ్‌తో చూశామని గ్రామస్తులు చెప్పడంతో పోలీసులు అఖిలేశ్‌ని ప్రశ్నించారు. అఖిలేశ్ సమాధానాలు అనుమాస్పదంగా ఉండడంతో పోలీసులు అతడిని తమ పద్ధతిలో విచారణ చేశారు. అప్పుడు అఖిలేశ్ చెప్పిన నిజం విని పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. 


పోలీసులు కథనం ప్రకారం మృతుడు నరేశ్ యాదవ్ ఒక విలాస పురుషుడు. అతడికి వివాహేతర సంబంధాలు ఉండేవి. అఖిలేశ్ వదినపై కూడా ఒకసారి అతను అత్యాచార యత్నం చేసినట్లు అఖిలేశ్ పోలీసులకు చెప్పాడు. దీంతో నరేశ్‌ను గుణపాఠం నేర్పాలని అఖిలేశ్ అవకాశం కోసం ఎదరుచూస్తున్న తరుణంలో.. ఒకరోజు నరేశ్ భార్య అఖిలేశ్‌ని రహస్యంగా మాట్లాడాలని పిలిచింది. నరేశ్ వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న అతడి భార్య తట్టుకోలేకపోయింది. మరో స్త్రీతో సంబంధం పెట్టుకున్నందకు భర్తను హత్య చేయాలని నిర్ణయించుకుంది. దీనికోసం అఖిలేశ్‌ని సంప్రదించింది. 


తన భర్తను చంపితే రూ.2 లక్షలు ఇస్తానని అఖిలేశ్‌కు ఉష చెప్పింది. అందులో భాగంగా రూ.1 లక్ష అడ్వాన్స్ కూడా చెల్లించింది. నరేశ్‌పై పగతో రగిలిపోయే అఖిలేశ్ ఉష వద్ద హత్య చేయడానికి సుపారీ తీసుకున్నాడు. ఆ తరువాత జనవరి 10న రాత్రి నరేశ్‌ను బాగా మందు తాగించి అతను స్పృహ కోల్పోయాక అతని తలనరికేశాడు. శవం ఎవరికీ దొరకకుండా దాన్ని రెండు భాగాలని గ్రామంలోని వేర్వేరు పొలాల్లో దాచిపెట్టాడు. కానీ పోలీసులకు శవ భాగాలు దొరకడంతో అఖిలేశ్ కథ అడ్డం తిరిగింది. 

అఖిలేఖ్ వాంగ్మూలంపై పోలీసులు హత్య కేసులో మృతుడు నరేశ్ భార్యను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.


Updated Date - 2022-01-16T08:50:58+05:30 IST