పుస్తక పఠనంతో విజ్ఞానం
ABN , First Publish Date - 2022-05-08T04:51:06+05:30 IST
పుస్తక పఠనంతో విజ్ఞానం పెంపొందుతుందని డీసీసీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు.
- డీసీసీ అఖిల్ మహాజన్
మంచిర్యాల కలెక్టరేట్, మే 7: పుస్తక పఠనంతో విజ్ఞానం పెంపొందుతుందని డీసీసీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. శనివారం జిల్లా గ్రంథాలయానికి మంచి ర్యాల చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో రూ.10 వేల విలువైన పుస్తకాలు, వంద కుర్చీలను డీసీపీ చేతుల మీదుగా విరాళంగా అందజేశారు. డీసీపీ మాట్లాడుతూ జ్ఞాన సముపార్జనలో పుస్తకాలు దోహదపడతాయన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్కు అనుగుణంగా గ్రంథాలయాల్లో ఉండే పుస్తకాల ను చదువుకుని క్రమశిక్షణతో లక్ష్యం వైపు అడుగులు వేయాలన్నారు. అనంతరం గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్కుమార్, చాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవాధ్యక్షుడు గోనె శ్యాంసుందర్రావు, అధ్యక్షుడు గుండ సుధాకర్లు మాట్లాడు తూ ప్రభుత్వం గ్రంథాలయాలను పటిష్టం చేస్తుందని, గ్రామీణ, నిరుపేద నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించా లని ఆకాంక్షించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి ఇరుకుల్ల శ్రీనివాస్, జుగల్ కిశోర్వ్యాస్, రావుల మహేష్, జగదీష్, కొత్త శ్రీనివాస్ పాల్గొన్నారు.