ఎన్టీఆర్‌, వైఎస్‌ పరిపాలనకు జగన్‌ వారసుడు: కొడాలి నాని

ABN , First Publish Date - 2021-03-30T23:15:35+05:30 IST

మొన్నటి ఎన్నికల్లో ప్రజలను తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిట్టారని మంత్రి కొడాలి నాని అన్నారు.

ఎన్టీఆర్‌, వైఎస్‌ పరిపాలనకు జగన్‌ వారసుడు: కొడాలి నాని

అమరావతి: మొన్నటి ఎన్నికల్లో ప్రజలను తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిట్టారని మంత్రి కొడాలి నాని అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్‌ను మంగళగిరిలో ఓడించారని.. ప్రజలను చంద్రబాబు బూతులు తిడుతున్నారన్నారు.  ఎన్టీఆర్‌ ఆశయాలకు చంద్రబాబు తూట్లు పొడిచారని మండిపడ్డారు. చంద్రబాబు అవినీతి చక్రవర్తి అని కొడాలి నాని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి అప్పుతెచ్చి పెట్టింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఎన్టీఆర్‌, వైఎస్‌ పరిపాలనకు జగన్‌ వారసుడని కొడాలి నాని చెప్పారు. చంద్రబాబును ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ కాపాడలేకపోయారని కొడాలి నాని పేర్కొన్నారు.

Updated Date - 2021-03-30T23:15:35+05:30 IST