మళ్లీ మీడియా ముందుకొచ్చిన కొడాలి నాని.. దుమారం రేపే వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-09-29T22:51:35+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి కొడాలి నాని మరోసారి మీడియా ముందుకొచ్చారు...

మళ్లీ మీడియా ముందుకొచ్చిన కొడాలి నాని.. దుమారం రేపే వ్యాఖ్యలు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ మంత్రి కొడాలి నాని మరోసారి మీడియా ముందుకొచ్చారు. అంతర్వేది రథం దగ్ధం, తిరుమల డిక్లరేషన్‌పై నాని చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేగాయో.. ఆ వ్యాఖ్యలతో రాష్ట్రంలో పరిస్థితులు ఎలా మారిపోయాయో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయడమే కాకుండా.. నానిపై పలు చోట్ల కేసులు కూడా పెట్టారు. నాని చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోని నేతలకు రుచించలేదని కూడా పుకార్లు వచ్చాయి. ఈ మాటల మంటలు చల్లారకే ముందే మరోసారి మీడియా ముందుకొచ్చిన మంత్రి.. టీడీపీ నేతలపై తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు.


తాజా వ్యాఖ్యలు ఇవీ..

టీడీపీ సన్నాసులకు చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టులు చదవడం తప్ప లోకజ్ఞానం తెలియదని నాని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలే దళితులపై దాడులు చేయించి.. జగన్‌ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మంత్రి ఆరోపించారు. కొందరు టీడీపీ నేతలు విషపూరిత ఉపన్యాసాలు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు.


టీడీపీ నేతలు కేసులు వేయడం వల్లే ఇళ్ల పట్టాల పంపిణీ ఆగిందని.. త్వరలోనే మహిళల పేర్లపై రిజిస్ట్రేషన్లు చేసి, ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని కొడాలి నాని స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్ అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. సంక్షేమ కార్యక్రమాల కోసం ఇప్పటి వరకూ రూ.60 కోట్లు ఖర్చు చేశామన్నారు. మరోవైపు మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. చిత్తూరు ఘటన, బాబు హయాంలో జరిగిన ఆలయాల కూల్చివేతలను ప్రస్తావిస్తూ టీడీపీపై విమర్శలు గుప్పించారు.

Updated Date - 2020-09-29T22:51:35+05:30 IST